అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రతిరోజూ యోగా సాధన చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్. ఉమ పర్యవేక్షణలో వ్యాయామ ఉపాధ్యాయులు టి. శ్యాంసుందర్, పైల నాని యోగా ప్రోటోకాల్కు అనుగుణంగా సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంలో శిక్షణ అందిస్తున్నారు. యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతాయని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు సామూహిక యోగాభ్యాసం చేయనున్నారు.